కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడించేస్తోంది. ప్రతి రాష్ట్రంలో రోజూ కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశా ఆర్ధిక రంగంతోపాటు రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులు కూడా సంక్షోభంలో ఉంటున్నాయి. వ్యవస్థను నడిపించడం కంటే కోవిడ్ నివారణకి, కట్టడికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ జాబితాలో కర్ణాటక రాష్ట్రం కూడా ఉంది. బెంగళూరు నగరంలో కోవిడ్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యడ్యూరప్ప ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవట్లేదని అన్నారు. కరోనా విపత్తు సమయంలో ప్రజలకు రక్షణగా నిలవాల్సింది పోయి ఏకంగా రెండు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపించాలని అన్నారు. అసెంబ్లీలో సైతం దీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బెంగళూరు నగరంలో కోవిడ్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్నాయి.