నెల్లూరు జిల్లాలోని కావలిలో తెలుగుదేశం వ్యవస్థాపకడు – మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై టీడీపీ నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు… బాబు అయితే “ఎన్టీఆర్ విగ్రహాన్ని తాకాలంటే వైకాపా నేతల గుండెల్లో వణుకు పుట్టాలి అనే రేంజ్ లో చర్యలు ఉండాలి” అని కార్యకర్తలను రెచ్చగొట్టేపనికి పూనుకున్నారు! వారి సంగతి అలా ఉంటే… ఈ విషయంలో ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణకు – వైకాపా ఎమ్మెల్యేలకు మధ్య ఈ వ్యవహారంపై ఫోన్ సంభాషనలు జరుగుతున్నాయి!
మొదట్లో చంద్రబాబులానే బాలయ్య కూడా కాస్త ఫైరయినట్లు అనిపించినా… అనంతరం కావలి స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నుంచి బాలయ్యకు ఫోన్ వెళ్లడం.. అనంతరం విగ్రహం తొలగింపుకు గల కారణాలను తెలపడం.. విగ్రహ పునఃప్రతిష్ట పై క్లారిటీ ఇవ్వడం కూడా జరిగిపోయిందంట. ఫలితంగా బాలయ్య కూల్ అవ్వడమే కాకుండా వైకాపా ఎమ్మెల్యేల జవాబుదారీతనానికి హ్యాపీ ఫీలయ్యారని అంటున్నారు!
దీంతో ఈ విషయంపై బాలయ్యకు – కావలి వైకాపా ఎమ్మెల్యేకు రెగులర్ గా ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయని… విగ్రహ ఏర్పాటూకు సంబందించి రెగ్యులర్ అప్ డేట్స్ షేర్ అవుతున్నాయని అంటున్నారు. ఇదే క్రమంలో జిల్లాకు చెందిన మరికొంతమంది వైకాపా నేతలు కూడ ఈ విషయంపై బాలయ్యకు ఫోన్స్ చేస్తున్నారని… తాము కూడా ఎన్టీఆర్ అభిమానులమే అని.. విగ్రహం విషయంలో మీరేమీ ఫీలవ్వొద్దని, “వి ఆర్ దేర్” అంటున్నారని తెలుస్తోంది! ఈ రకంగా వైకాపా ఎమ్మెల్యేలు బాలయ్య మనసు దోచుకుంటున్నారని కావలిలో టాక్!!