ప్రభాస్ కెరీర్ లో 21 వ సినిమాగా తెరకెక్కనున్న సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీదత్ సమర్పణలో ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్ కి 50 వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుండగా. మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకోసం దర్శక, నిర్మాతలు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారట.
రీసెంట్ గా ఈ సినిమాలో నటించే హీరోయిన్ దీపక పదుకొణె అని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనుకుంటుండతంతో బాలీవుడ్ స్టార్ హీరీయిన్ అయిన దీపక పదుకొణె ని ఎన్నుకున్నారని సమాచారం. ఇక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్న ఈ సినిమాలో దీపిక యువరాణి పాత్ర పోషిస్తుందట.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ దీపక పదుకునే రెమ్యూనరేషన్ గురించే. పద్మావత్, భాజీరావ్ మస్తాని లాంటి పీరియాడికల్ సినిమాలు చేసిన దీపిక కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకనే ఈ సినిమా కోసం 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట మేకర్స్. అదే గనక నిజమైతే మొదటిసారి టాలీవుడ్ లో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా దీపిక రికార్డ్ క్రియోట్ చేసినట్టే. ఇక ప్రభాస్ రెమ్యూనరేషన్ కంపేర్ చేయనవర్సం లేదు. ఆ లెక్కలు వేరేగా ఉంటాయి.
ప్రస్తుతం ప్రభాస్ యంగ్ డైరెక్టర్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ కి జంట గా నటిస్తుండగా ఈ పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమా 2021 లో రిలీజ్ కానుంది. అది కూడా అన్ని పరిస్థితులు అనుకూలిస్తే.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!