ఢిల్లీ, జనవరి 9: సిబిఐ కేంద్ర కార్యాలయంలో డైరెక్టర్గా అలోక్ వర్మ బుధవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మళ్లీ ఆయన విధులకు హజరయ్యారు. ఆయనను సెలవుపై పంపుతూ కేంద్రం, సివిసి తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పు పడుతూ తిరిగి అతనికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. విధానపరమైన ముఖ్య నిర్ణయాలు ఏవీ తీసుకోవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు.
ఈ నెల 30వ తేదీన అలోక్ వర్మ పదవీ విరమణ చేయనున్నారు.