YS Jagan taking stock of progress at Gadapa Gadapaku review meeting: “గడపగడపకు”సమీక్షా కార్యక్రమం
Gadapa Gadapaku Mana Prabhutvam: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని(Tadepalli) సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గడపగడపకూ(Gadapa Gadapaku Mana Prabhutvam)మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షా సమావేశం గరం గరంగా జరిగినట్లు ఉన్నత స్థాయి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్చార్జ్జీలతో జగన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి గత నెల రోజులుగా సాగుతున్న గడపగడపకూ కార్యక్రమం మీద వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించి తన వద్ద ఉన్న గణాంకాలను వారి ముందు పెట్టి కొన్ని నియోజకవర్గాల్లోని అపశ్రుతులను ఎత్తిచూపారు.అక్కడక్కడా జరుగుతున్న పోటీ కార్యక్రమాలపై ఆయన ఆయా నియోజకవర్గాల నేతలకు క్లాస్ పీకారని కూడా భోగట్టా!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇద్దరు మాజీ మంత్రులపై తీవ్ర అసహనం!
ఈ సమీక్షా సమావేశంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రులు,ప్రస్తుత ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy)మానుగుంట మహీధర్ రెడ్డి లు ప్రభుత్వం మీద వస్తున్న కొన్ని విమర్శలను సీఎం దృష్టికి తెచ్చినపుడు జగన్ వారి మీద సీరియస్ అయ్యారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను చదివి వాటిని నావద్ద ప్రస్తావిస్తారా అని ఆయన వారిపై మండి పడ్డట్లు భోగట్టా.
బాలినేనిపై భగ్గుమన్న జగన్: YS Jagan fired on Balineni Srinivas Reddy at Gadapa Gadapaku review meeting.
గడపగడపకు కార్యక్రమం సందర్భంగా మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏమిటని సీఎం అడగ్గా బాలినేని వాసు అమ్మ ఒడి లబ్ధిదారులను,ఈ పథకం కింద ఇచ్చే సాయాన్ని తగ్గించడం పై తల్లిదండ్రులలో అసంతృప్తి వ్యక్తమవుతోందని చెప్పారట.దీనిపై జగన్ తీవ్రంగా స్పందిస్తూ గత రెండేళ్లు పొరపాటున కొందరు అనర్హులకు ఈ పథకాన్ని వర్తింపజేశామని,ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలా అని వాసును సూటిగా ప్రశ్నించారు.అసలు అమ్మఒడి మార్గదర్శకాలను ముందు ఎమ్మెల్యేలు చదవాలని కూడా సీఎం చురక వేశారు.
మహీధర్ రెడ్డిపై మండిపాటు!
ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడం,విద్యుత్ కోతలు,ఇసుక కొరత తదితర అంశాలను సీఎం వద్ద ప్రస్తావించగా జగన్ మండిపడ్డారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాయడం, దాన్ని బీజేపీకి చీఫ్ నడ్డా హైలైట్ చెయ్యడం,అవన్నీ చదివి మీరు నా వద్ద ఆ విషయాలు ప్రస్తావిస్తారా అని మహీధర్ రెడ్డిని జగన్ నిలదీశారు అంటున్నారు.విషప్రచారాన్ని ఎమ్మెల్యేలు తిప్పికొట్టాలని ఆయన సలహా ఇచ్చారు.అలాగే ముస్లిం మహిళలకు షాదీముబారక్ ఇవ్వాలని మరొకరు సూచించగా జగన్ నిష్కర్షగా తోసిపుచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews