NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu Naidu: తీగలాగితే డొంక కదులుతోంది!బాబు మెడకు చుట్టుకోనున్న మరో భారీ స్కామ్ ?

Chandrababu Naidu: తెలంగాణలో ఈఎస్‌ఐ స్కామ్‌లో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతుంటే, అటు ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ సోదాలతో ఏపీ ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెరసి.. తీగ లాగితే డొంక కదులుతోంది. మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణ పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అక్రమాలు వెలుగు చూస్తుండటం ఇప్పుడు కాక రేపుతోంది. అప్పట్లో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్యతో పాటు.. ఏపీఎస్‌ఎంఐడీసీ ఎండీగా పనిచేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు గోపీనాథ్‌ పేర్లు ఉండటం రాజకీయంగా మరింత హీట్‌ పెంచుతోంది.

Another huge scam around Chandrababu Naidu neck?
Another huge scam around Chandrababu Naidu neck?

సామాన్యుడు తవ్వితీసిన కుంభకోణమిది!

2015 నుంచి జరిగిన ప్రాజెక్ట్‌ టెండర్లలో అక్రమాలు జరిగాయని.. కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు కోట్లాది రూపాయలు తినేశారని గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదులొచ్చాయి. ఐతే అప్పటి ప్రభుత్వం వాటిని లైట్‌ తీసుకోవడంతో హైకోర్టును ఆశ్రయించారు ఇందుకూరి వెంకట రామరాజు అనే వ్యక్తి. ఆయనిచ్చిన కంప్లైంట్‌ ఆధారంగా విచారణ జరిపిన హైకోర్టుల ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టిగేషన్‌ చేసి ఏసీబీ ఇచ్చిన నివేదికను అప్పటి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీఐడీని ఆదేశించారు.ఆ తర్వాత సీఎస్‌గా వచ్చిన నీలం సాహ్ని కూడా మరోసారి దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

అప్పుడు అసలు ఏం జరిగింది ?

2015లో ప్రభుత్వాస్పత్రులు, వైద్య కళాశాలల్లో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణకు ఏపీఎస్‌ఎంఐడీసీ ద్వారా టెండర్లు పిలిచింది చంద్రబాబు సర్కార్‌. బెంగళూరుకు చెందిన టీబీఎస్‌ ఇండియన్‌ టెలీమాటిక్‌, బయో మెడికల్‌ సర్వీసెస్‌ అనే సంస్థకు టెండర్‌ ఖరారు చేసింది. ఐతే ఈ టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలొచ్చాయి.టెండర్లు దక్కించుకున్న సంస్థ వైద్య పరికరాల విలువను మార్కెట్‌ ధరల కంటే అమాంతం పెంచేసి చీటింగ్‌ చేసిందని ప్రధాన ఆరోపణ. ఏడాదికి 460 కోట్ల రూపాయల భారీ మొత్తానికి టెండర్‌ కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని ఆరోపణలున్నాయి. మొత్తంగా 2వందల కోట్ల రూపాయల విలువజేసే ఎక్విప్‌మెంట్‌ను 5వందల కోట్ల రూపాయలుగా చూపించినట్లు చెబుతున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల మేర నిధులు నొక్కేశారన్న ఆరోపణల నిగ్గు తేలాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.చాలా ఆసక్తికరమైన విషయాలు అతిత్వరలో వెలుగుచూడనున్నాయని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N