AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల (ఫిబ్రవరి) 5 నుండి మూడు లేదా నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. 5వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 5న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలానే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు సమావేశాలను నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. మూడు లేదా నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. 6,7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చతో పాటు వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో వైసీపీ సర్కార్ కు ఈ అసెంబ్లీ సమావేశాలే చివరి సమావేశాలు కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే .. ఎన్నికలకు ముందు ఓటాన్ అకోంట్ పెట్టడం ఆనవాయితీగా వస్తొంది.
KRMB Meeting: ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణాబోర్డుకే .. అంగీకరించిన తెలుగు రాష్ట్రాలు