మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ ఏపీ సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఇవేళ గుంటూరు సీఐడీ విచారణకు వారు హజరు కాలేదు. ఇంతకు ముందు మార్గదర్శి కేసులో రామోజీరావు, శైలజాకిరణ్ లను ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ కు వెళ్లి వారి నివాసంలో విచారించారు. అయితే వారి నుండి మరి కొంత సమాచారం తెలుసుకోవాల్సి ఉన్నందున ఏపీ సీఐడీ అధికారులు ఈ నెల 5వ తేదీ (ఇవేళ) గుంటూరు కార్యాలయానికి హజరు కావాలని ఇటీవల నోటీసులు ఇచ్చారు.
ఏదో అదుకుంటే .. మరేదో అయ్యింది..!
అయితే అనారోగ్య కారణాలతో రామోజీరావు, రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హజరుకాలేమని ఈమెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్దంగా మళ్లించారనీ, నిబంధనలకు విరుద్దంగా అక్రమ డిపాజిట్ల సేకరించారని రామోజీరావు, శైలజా కిరణ్ తో పాటు మరి కొందరిపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ 41 (ఏ) కింద గత నెల 22న వారికి నోటీసులు జారీ చేయగా, దానికి వారు గైర్హజరు కావడంపై సీఐడీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
YS Jagan: ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ .. అందుకే అంటున్న విపక్షాలు