చేయమనిషికి జీవన ఆధారం నీరు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు తాగడం చాల ముఖ్యం. రోజు మొత్తం చెమట ద్వార కోల్పోయిన నీటిని తిరిగి మళ్ళీ భర్తీ డం అవసరం. శరీరములో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి కూడా అంతే విలువ ఉన్నది. ప్రస్తుత కాలంలో అందరు మంచినీరు కాకుండా మినరల్ వాటర్ ను ఎక్కువగా తాగుతున్నారు.వాటివలన కలిగే అనర్ధాలు తెలుసుకోండి..
నీటిలో క్లోరిన్, ఇయోడి్న్, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు.మనిషి శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలకు సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రవహిస్తుంది. మానవ శరీరంలో సుమారు 60-70 శాతం నీటితో ఉంటుంది.
మినరల్ వాటర్:
ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ని కొని అవే మంచివని లీటర్ 4 రూపాయల నుండి 25 రూపాయలు వరకు ఖర్చు పెడుతున్నాం.ఈ వాటర్లో మినరల్స్ ఉండవు సరికదా.. వీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే, రోగాలని కొనుక్కుంటున్నారు. మరీ ముఖ్యంగా.. ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ క్యాన్లలో వచ్చే నీటిని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, పాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ వంటివి మినరల్ వాటర్లో ఉండవు.
అనారోగ్య సమస్యలు :
మినరల్ వాటర్ తాగడం వలన కిడ్నీ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కిడ్నీల్లో రాళ్లు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి, ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి.వీటితో పాటు మినరల్ వాటర్ తాగడం వల్ల తక్కువ వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తాయి.
మంచి నీరు ఇలా తాగితే చాల ప్రయోజనాలు:
మామూలు ఏ మంచినీరైనా సరే దానిని కాచి చల్లార్చి రాగి పాత్రల్లో కానీ, కుండలో పోసి ఆ నీరు తాగితే చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరం లోపల వున్న మలినాలు,విషపదార్థాలను బయటకు తొలగించి శరీరంని శుభ్రపరుస్తుంది.
ఇక కుండనీరు తాగితే ఎముకలకి అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకల్లో బలహీనంగా మారుతాయని చెబుతున్నారు.అదే విధంగా చాలా మంది నీరు ఎక్కువగా తాగరు. దీని వల్ల భవిష్యత్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరంలోని అన్నీ జీవిక్రియలకు నీరే ఆధారం.
అందుకే నీరు ఎంత తాగితే అంత మంచిది. అప్పుడే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు దూరం అవుతాయి. నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్గా ఉంటుంది. ఒక్క ఆరోగ్య పరంగానే కాదు.. అందానికి కూడా నీరు ముఖ్యం అని చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం మెరుస్తూ తాజాగా ఉంటుంది. ఇక జుట్టు రాలే సమస్యలు వంటివి కూడా ఉండవు.. కాబట్టి కచ్చితంగా నీరు ఎక్కువగా తీసుకోవాలి.. అదికూడా.. మినరల్ వాటర్ బదులు మామూలు మంచినీరు మంచిదని చెబుతున్నారు నిపుణులు.