Big Breaking: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనను ఈడీ అధికారులు కొద్ది సేపటి క్రితం అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు దృవీకరించారు.
పెద్ద సంఖ్యలో ఆప్ నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు వ్యాన్ లో ఎక్కించి స్టేషన్ కు తరలిస్తున్నారు. కాగా అరెస్టు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు.
ఢిల్లీ హైకోర్టు ఇవేళ అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్టు నుండి ఉపశమన ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కొద్ది గంటల వ్యవధిలో ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో అరెస్టు చేయనున్నారటూ ప్రచారం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హజరు కాలేదు.
కాగా, అరెస్టు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ధాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానంలో ఉపశమనం లభించలేదు. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడి అధికారులు ఆయన ఇంటికి చేరుకుని సోదాలు జరిపి వెంటనే అరెస్టు చేసినట్లుగా ప్రకటించారు.
రీసెంట్ గా ఈ కేసులో హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ కేసులో 15 మందిని అరెస్టు చేశారు.
YS Sharmila: కడప జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం .. పోటీపై ఏమన్నారంటే ..?