పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందబోతున్న సంగతి తెల్సిందే. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం వకీల్ సాబ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఈ సినిమాలోనే నటించబోతున్నాడు.
అయితే గత కొన్ని రోజులుగా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మీద రక రకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. మలయాళంలో ఉన్న రెండు క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ మాత్రమే తెలుగులో ఉండబోతుందని పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఒక క్యారెక్టర్ ని తీసేశారని రూమర్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ మాత్రమే మేయిన్ గా ఉండబోతున్నాడని వార్తలు పుట్టుకొచ్చాయి. కాని అలాంటిది ఏమీ లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు తాజా సమాచారం. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయని తెలుస్తోంది.
కథలో కొన్ని కీలక మార్పులు మాత్రమే చేయడం జరిగిందట. అంతే తప్ప ఒరిజనల్ కథ ని ఏమాత్రం మార్చలేదని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోల క్యారెక్టర్స్ కూడా ఓరిజినల్ లో ఉన్నట్టుగానే ఉంచారట గాని అనవసరమైన మార్పులు మాత్రం చేయలేదని సమాచారం. పవర్ స్టార్ ఇమేజ్ కి అలాగే తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథకు కొన్ని సీన్స్ మాత్రమే యాడ్ చేసినట్టు మేకర్స్ తెలిపారట.
మన తెలుగు ప్రేక్షకులు బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవడం కోసం ‘కోషియమ్’ ఫ్యామిలీ లో తండ్రి, తల్లి, భార్య పాత్రలకు .. అయ్యప్పన్ చుట్టూ వుండే డ్రైవర్, సిఐ సహా మిగతా పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేలా డెవలప్ చేశారట. సెంటిమెంట్ పరంగా బాగా వర్కౌట్ చేసినట్టు సమాచారం. త్వరలో రానా కు ఫైనల్ వర్షన్ స్క్రిప్ట్ వినిపించబోతున్నారట. రానా కి గనక నచ్చితే అఫీషియల్ గా రానా ని ప్రాజెక్ట్ లో కి ఇన్వైట్ చేస్తూ అనౌన్స్ చేస్తారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!