(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.
మసీదు కూల్చివేత కుట్ర కాదని, కూల్చివేతకు సరైన సాక్షాధారాలు లేవని పేర్కొన్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్ కె యాదవ్.. అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు అందరూ నిర్ధోషులుగా తేలుస్తూ తీర్పు చెప్పారు. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. 2 వేల పేజీల తీర్పు ప్రతిని న్యాయమూర్తి యాదవ్ చదివి వినిపించారు. అభియోగాలను ఎదుర్కొంటున్న వారిలో 26 మంది కోర్టుకు హజరుకాగా ఆరుగురు నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హజరయ్యారు. ఘటన జరిగిన 28 సంవత్సరాల అనంతరం ఈ కేసులో తుది తీర్పు నేడు వెలువడింది.