టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో “రౌద్రం రణం రుధిరం” ఒకటి. పాన్ ఇండియన్ కేటగిరిలో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా ఒకేసారి అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు.
అయితే ఈ సినిమా రకరకాల కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. వాస్తవంగా అయితే ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా కుదరలేదు. దాంతో 2021 జనవరి సంక్రాంతికి ప్లాన్ చేశారు. అయితే అది సాధ్యపడలేదు. అందుకే మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అవుతూ 2021 సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి ఈ సినిమాని గత నెల 5 న షూటింగ్ ప్రారంభించి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. అంతేకాదు ఈ సినిమా రిలీజయ్యే వరకు తారక్, చరణ్ లు ఇద్దరు గెటప్స్ మార్చకుండా ఉండాలని సూచించాడట.
అయితే ఇలా వన్ ఇయర్ సినిమా డిలే అవడంతో తారక్, చరణ్ ల నెక్స్ట్ సినిమాల మీద ఆ ప్రభావం గట్టిగానే పడిందని అంటున్నారు. వాస్తవంగా ఈ సమ్మర్ నుంచే ఎన్.టి.ఆర్ – త్రివిక్రం సినిమా మొదలవ్వాల్సింది. కాని ఆర్ ఆర్ ఆర్ డిలే అవడంతో త్రివిక్రం ప్రాజెక్ట్ లేటవుతోంది. దాంతో ఎన్.టి.ఆర్ మైత్రీ మూవీ మేకర్స్ లో ప్రశాంత్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కూడా డిలే అవుతోంది. అయితే చరణ్ మాత్రం ఈ విషయంలో కాస్త క్లారిటీగా ఉండబట్టే ఏ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇది మంచిదే అయిందని అంటున్నారు. మొత్తానికి రాజమౌళి దెబ్బ ఈ ఇద్దరు హీరోల మీద గట్టిగానే పడిందంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!