బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అమితాబ్ కు కరోనా టెస్ట్ లో పాజిటివ్ అని తేలిందని, అందుకనే ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
అమితాబ్ బచ్చన్ కు ప్రస్తుతం 77 సంవత్సరాలు. అలియా భట్, రన్బీర్ కపూర్ జంటగా నటిస్తోన్న బ్రహ్మాస్త్రలో కీలక పాత్ర పోషించారు. రీసెంట్ గా అమితాబ్, ఆయుష్మాన్ తో కలిసి నటించిన గులాబో సితాబో డైరెక్ట్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరోవైపు అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి షో ను హోస్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం ప్రభుత్వం విధించిన రూల్స్ కారణంగా అమితాబ్ ఇంట్లోనే ఉంటున్నారు.