Big Breaking: ప్రధాన మంత్రి నరేంద్ర హత్యకు కుట్ర చేసినట్లుగా ముంబాయి లోని ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. మోడీని చంపేస్తామంటూ ఈమెయెల్ లో బెదిరించారు. ప్రధాన మంత్రి మోడీ హత్యకు 20 మందితో స్లీపర్ సెల్స్ ను తయారు చేశామని ఈ మెయిల్ లో పేర్కొన్నారు.
Big Breaking: 20 కేజీల ఆర్డీఎక్స్ కూడా సిద్దం చేశామంటూ..
మోడీ హత్యకు 20 కేజీల ఆర్ డీ ఎక్స్ ను కూడా సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించింది. అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. వివిధ ఏజన్సీలకు ఈ మెయిల్ వివరాలను పంపించారు. ఎక్కడ నుండి ఈమెయిల్ వచ్చిందై..? ఎవరు ఈ మెయిల్ పంపించారు..? అనే విషయంపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. ఇది టెర్రరిస్టుల చర్యగానే అనుమానిస్తున్నారు.