Bigg Boss Telugu 5 : సీజన్ ఫోర్ రన్నర్ టైటిల్ గెలుచుకున్న… అఖిల్(Akhil) ప్రారంభంలో ప్రియ ఆంటీ కి సపోర్ట్ చేయటం తెలిసిందే. హౌస్ లో తన సపోర్ట్ ప్రియ ఆంటీ(Priya Aunty) కి అంటూ స్పెషల్ గా వీడియో రూపంలో ఆమెకు సపోర్ట్ చేయటం జరిగింది. అయితే ఏడ వారంలో ప్రియా ఆంటీ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రియ ఆంటీ ఎలిమినేట్ అవ్వటంతో.. హౌస్ లో ఏడుగురు ఎలిమినేటి కావటంతో 12 మంది మిగిలారు. ఈ నేపథ్యంలో హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రియ ఆంటీ వీడియో రూపంలో.. అభిమానులను తనని సపోర్ట్ చేసిన వారిని కలుస్తూ వారు వేసే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంది.
ఈ క్రమంలో అఖిల్(Akhil) కూడా .. ప్రియ ఆంటీ ఇచ్చిన లైవ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా ప్రియ ఆంటీ అఖిల్ కి… కృతజ్ఞతలు తెలపడం జరిగింది. హౌస్ లో ఉన్నంతకాలం తనకు సపోర్ట్ ఇచ్చినందుకు. ఈ తరుణంలో వీరిద్దరు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ గురించి అనేక విషయాలు ముచ్చటించారు. అఖిల ప్రియ ఆంటీ ని పలు ప్రశ్నలు వేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక మీరు..మైక్ … గురించి వెతికా రా… ఇంకా బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఉన్నట్లు అనుభవం.. బయట కూడా ఉందా అంటూ చాలా ఫన్నీ క్వశ్చన్ లు అఖిల్…. ప్రియ ఆంటీ కి వేశారు. ఆమె కొంటెగా జవాబులు ఇవ్వడం జరిగింది.
ఆమెను బయటకు కలుస్తాను…
ఈ నేపథ్యంలో ప్రియ ఆంటీ అఖిల్ కి.. ప్రశ్నలు సంధించింది. తాను బయటకు రావడంతో ఇప్పుడు ప్రస్తుతం హౌస్ లో.. నీకు ఇష్టమైన కంటెస్టెంట్ లు ఎవరు అని అఖిల్ కి… ప్రియ ఆంటీ ప్రశ్న వేసింది. దానికి అఖిల్ సమాధానమిస్తూ… మానస్, పింకీ ఇద్దరూ తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అని స్పష్టం చేశారు. ముఖ్యంగా పింకీ ఆటతీరు అంటే తనకు చాలా ఇష్టమని కచ్చితంగా ఆమెను బయటకు కలుస్తాను. వీలైతే మీరే కలపాలి అని అఖిల్ కోరారు. ఈ క్రమంలో మానస్… నీ గురించి ఒకనొక సందర్భంలో మాట్లాడటం జరిగింది. చాలా పాజిటివ్ గా మాట్లాడాడు అంటూ అఖిల్ కి ప్రియా ఆంటీ చెప్పుకోచ్చింది.