ముంబాయి, ఫిబ్రవరి 16: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జీవితంపై రూపొందించిన బయోపిక్ మూవీ మార్చి ఐదవ తేదీ లోపు యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు ప్రముఖ దర్శకుడు అనురాగ్ భూసరి తెలిపారు.
ఇప్పటికే బయోపిక్ ట్రైలర్ యూట్యూబ్లో విడుదల అయ్యింది.
నాగ్పూర్కు చెందిన 20మంది యువకుల నిర్మాణ సారధ్యంలో ఈ బయోపిక్ను దర్శకుడు అనురాగ్ భూసరి దర్శకత్వంలో చిత్రీకరించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ అనురాగ్ మాట్లాడుతూ ఇటీవల రాజకీయ నాయకులపై అనేక బయోపిక్స్ వచ్చాయి, కానీ అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయన్నారు.
ఈ బయోపిక్ వాస్తవాలకు దగ్గరగా ఉంటుదంని తాను భరోసా ఇవ్వగలనని అనురాగ్ స్పష్టం చేశారు.
ఆరు నెలల పాటు బయోపిక్ ప్రాజెక్టుపై పరిశీలన చేసి రెండు నెలల్లో ఈ చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశామని అనురాగ్ చెప్పారు.
ఈ చిత్రం తీయడానికి ముందు నితిన్ గడ్కరీని సంప్రదించడం గానీ, అనుమతి కోరడం గానీ చేలేదనీ, ఆయన సతీమణి కంచన్ గడ్కారీతో, ఆయన చిన్న నాటి నాటి స్నేహితుడిని కలుసుకుని పలు విషయాలను సేకరించినట్లు అనురాగ్ తెలిపారు.
నితిన్ గడ్కరీ ఎంత మంచి వ్యక్తిగా ఉన్నాడో చూపించాలని భావించలేదన్నారు. ఆయన జీవితంలోని పోరాటాలు, 2014 కేంద్ర మంత్రిగా ఎదిగే వరకూ ఆయన జీవితంలోని ముఖ్య విషయాలను వాస్తవాలకు దగ్గరగా చూపానని అనురాగ్ వెల్లడించారు.
ఈ చలనచిత్రం బాలివుడ్లో రాజకీయ వేత్తలపై రూపొందించిన బయోపిక్ జాబితాల్లో చేరింది.
ఇప్పటికే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై అనుపమ్ ఖేర్ బయోపిక్ లు విడుదల చేయగా ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై వివేక్ ఒబెరాయ్ బయోపిక్ రూపొందిస్తున్నారు.
గడ్కరీ బయోపిక్ ట్రైలర్ కొరకు కింద క్లిక్ చేయండి
https://youtu.be/QL-GVsSKO5U