రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ విజయాన్ని సాధించిన టిఆర్ఎస్ పార్టీ, 2019 పార్లమెంటు ఎన్నికలలో కంగు తింది. పూర్తి విషయంలోకి వెళితే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి పార్టీ ఊహించని స్థాయిలో కీలక స్థానాలలో గెలవడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కి సంబంధించి కవితని ఓడించటంతో బిజెపి హవా తెలంగాణలో స్టార్ట్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విధంగానే తెలంగాణ బిజెపి నేతలు అధికార పార్టీ టిఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాగా మధ్యలో ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని బండి సంజయ్ కి కట్టబెట్టి… బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుని తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ జండా ఎగరాలని… ఫుల్ పవర్స్ ఆయనకు ఇవ్వటం జరిగింది.
అయితే మధ్యలో కరోనా రావడంతో మొన్నటి దాకా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి ఎన్నికల వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో… బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరు అదేవిధంగా కార్యకర్తల దూకుడు ఆ పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్దీ తగ్గే రీతిలో ఉందని తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో టాక్. అదే రీతిలో దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గా ఉన్న రఘునందనరావు కి సంబంధించి కోటి రూపాయల డబ్బు కట్టలు బయటపడటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొనడంతో.. తెలంగాణలో బిజెపి పార్టీ గ్రాఫ్ అమాంతం తగ్గినట్లు పరిశీలకుల మాట.
హైదరాబాదులో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించడానికి బిజెపి పెద్ద స్కెచ్ వేసి నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇదంతా అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం అని తెలిపారు. అదే రీతిలో కరోనా సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలు సరైన రీతిలో తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యవహరించలేదని కూడా అధికార పార్టీ నేతలు పదే పదే ఆరోపించడంతో తెలంగాణాలో బీజేపీ పై ప్రజలకు గతంలో మాదిరి అభిప్రాయం లేదన్న టాక్ వినబడుతోంది.
రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాదు అన్నట్టుగా ప్రజలలో మెల్లగా బీజేపీపై వ్యతిరేకత మొదలైనట్లు వార్తలు స్టార్ట్ కావటంతో బీజేపీలో ఉన్నటువంటి పేరుగాంచిన నేతలు పార్టీ నుండి జంపు అవటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు స్టార్ట్ అయ్యాయి. బిజెపి పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి అనే విధంగా మరికొంతమంది నేతలు ఇప్పటికే రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో మరికొంతమంది నేతలు కూడా బీజేపీని వీడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.