NTR : ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు మొదలవనున్నా అది పాన్ ఇండియన్ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇప్పటికే ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. అందుకే ఇకపై సినిమాలను పాన్ ఇండియన్ రేంజ్లో బహుభాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చేయబోయే మరో రెండు ప్రాజెక్ట్స్ లను ప్రకటించాడు. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో చిత్ర యూనిట్ ఇచ్చేసింది. ఈ సినిమాలలో ఒకటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న పాన్ ఇండియా మూవీ ఉంది. దీని మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య కంప్లీట్ చేస్తూనే మరొక వైపు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తూ వస్తున్నారు. కొరటాల శైలిలోనే మంచి సామాజిక అంశాలతో పాటు తారక్ రేంజ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కొరటాల శివ పాన్ ఇండియన్ స్థాయిలో కథ సిద్దం చేస్తున్నారట. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథ స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి కథలను కొరటాల అద్భుతంగా డీల్ చేస్తాడు.
NTR : కియారా అద్వానీ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది కాబట్టి కొంతమంది క్రేజీ బాలీవుడ్ నటులను తీసుకోనున్నారట. ఇందులో భాగంగానే ‘భరత్ అనే నేను’ సినిమాతో కొరటాల టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన బ్యూటీ భామ కియారా అద్వానీ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ మూవీకి కియరాకు భారీ రెమ్యూనరేషన్ ముట్ట చెబుతున్నారట. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందివ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘సెన్సేషనల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు.