BREAKING: టాలీవుడ్ లో అగ్రహీరోలైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ అతి త్వరలోనే బుల్లితెరపై స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. తారక్ జెమినీలో ప్రసారం అవుతున్న “ఎవరి మీద కోటీశ్వరులు” అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి విధితమే. అయితే ఈ షోకి మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చి సందడి చేయనున్నారని విశ్వసనీయ సమాచారం.
Naga Chaitanya: నాగ్ రూట్లోనే నాగ చైతన్య.. బాలీవుడ్ కలిసి వస్తుందా..?
ఇటీవల విడుదలైన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమోలో రాజమౌళి, కొరటాల శివ కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు విచ్చేయనున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో ని ఎదుర్కొని.. వ్యూయర్ షిప్ పెంచుకోవడానికి జెమిని యాజమాన్యం సెలబ్రెటీలను తీసుకొస్తుందని స్పష్టమౌతుంది. గత కొన్నేళ్లుగా తక్కువ టీఆర్పీ రేటింగుతో జెమినీ టీవీ సతమతమవుతోంది. దాంతో యాజమాన్యం జెమినీ టీవీని మళ్ళీ గాడిలోకి తెచ్చేందుకు ఎవరు మీలో కోటీశ్వరులు, మాస్టర్ చెఫ్ వంటి భారీ ప్రోగ్రాములను ప్రసారం చేస్తోంది.
Leader: లీడర్ సినిమా రానా కంటే ముందు శేఖర్ కమ్ముల చేయాలనుకున్న సూపర్ స్టార్ వీరేనట..!