BREAKING: ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం దళిత గిరిజన దండోరా పాదయాత్ర 4 కిలోమీటర్ల వరకు ర్యాలీగా వెళ్లిన ములుగు ఎమ్మెల్యే సీతక్క తహశీల్దార్ కార్యాలయంలో కళ్ళు తిరిగి అస్వస్థతకు గురైయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సీతక్కకు బిపి లెవెల్స్ తగ్గడంతో అక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు.
Ivy Guard Leaves: దొండకాయ ఆరోగ్యానికి బెస్టీ..!! మారి ఆకులు కూడానా..!?
దీంతో ఎమ్మెల్యే సీతక్కను హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి గురించి అప్డేట్ ఇంకా రాలేదు. తాజా సమాచారం కోసం అభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేస్తూ అధికార పార్టీపై ఫైర్ అయ్యే ఎమ్మెల్యే సీతక్క గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన పనిలేదు.
YSRCP Internal; ఒక మంత్రి.. ఆరుగురు ఎమ్మెల్యేలకు మూడినట్టే..!