Breaking : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వైయస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆమె రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించడం గమనార్హం.
కొద్ది రోజుల క్రితమే తాను తెలంగాణలో పార్టీ పెట్టడం తన అన్న జగన్ కు ఇష్టంలేదన్నట్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ శ్రేణులను తరచూ కలుస్తూ తాను తెలుగు రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు షర్మిల విపరీతంగా ప్రయత్నిస్తోంది.
ఇదే క్రమంలో ఆమె ఖమ్మం జిల్లాను టార్గెట్ చేసినట్లు అర్థం అవుతోంది. షర్మిల చేసిన ఈ సంచలన ప్రకటన తర్వాత జమిలి ఎన్నికలపై వస్తున్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి అనే చెప్పాలి.