Aamir Khan : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు రావటం మరోపక్క చాలా రాష్ట్రాలలో కేసులు పెరగటంతో అన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తూనే మరో పక్క కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందటంతో ప్రభుత్వాలు కూడా కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నాయి. సెలబ్రిటీల నుండి రాజకీయ నాయకులు అదేవిధంగా సామాన్యులు ఎవరు కూడా ఈ మహమ్మారి నుండి తప్పించుకోలేని పరిస్థితి.
ఇలాంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కు కరోనా సోకటం ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ఆయన పర్సనల్ అసిస్టెంట్ తెలియజేశారు. అమీర్ ఖాన్ సోషల్ మీడియా నుండి ఇటీవల వైదొలగడంతో ఆయన పిఎ ఈ వార్త తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఇంటిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇటీవల ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర లో వైరస్ విజృంభణ భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ వల్లనే ఆ రాష్ట్రంలో మహమ్మారి ముంబైలో భారీగా విస్తరించినట్లు అందువల్లే అమీర్ ఖాన్ మరియు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇటీవల కరోనా బారిన పడటం జరిగినట్లు తాజా వార్తపై నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!