మహమ్మారి కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ దెబ్బకు దేశంలో అన్ని సినిమాల షూటింగులు మొన్నటి వరకు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రభుత్వాల నుండి అనుమతులు రావడంతో మెల్లమెల్లగా షూటింగులు పున ప్రారంభం అవుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు స్టార్ట్ చేస్తున్నారు. కరోనా వైరస్ రాకముందు పబ్లిక్ ప్రదేశాలలో అనుమతులు తీసుకుని షూటింగులు చేసుకునే అవకాశం ఉండేది.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా.. షూటింగ్ లో దాదాపు స్టూడియోలలో మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర నుండి అనుమతులు తీసుకోవాల్సిందే. పరిస్థితులు ఇలా ఉండగా టాలీవుడ్ కుర్ర హీరో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలో ఉప్పల్ లో బ్యాంకు కాలనీలో ఓ పబ్లిక్ ప్లేస్ లో జరుగుతోంది.
అయితే ఉప్పల్ బ్యాంకు కాలనీ లో షూటింగ్ చేసేందుకు సినిమా యూనిట్ ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వనమాలి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే సరైన హిట్టు లేదని అనేక ప్రయత్నాలు చేస్తున్నా కుర్ర హీరో రాజ్ తరుణ్ కి… చేస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయే రీతిలో పరిస్థితి నెలకొనడంతో.. బ్యాడ్ టైం వెంటాడుతున్నట్లు…ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.