ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్ లు ధరించాలని ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చిన విషయం తెల్సిందే.
అయినా కానీ చాలా మంది కనీస బాధ్యత లేకుండా ముఖానికి ఎటువంటి రక్షణ లేకుండా, మాస్క్ లు వేసుకోకుండా బయట తిరుగుతున్నారు. ఇలాంటి వారిపై తెలంగాణ పోలీసులు కొరడా ఝళిపించనున్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారిని సీసీ కెమెరాల సాయంతో గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ దాదాపు 70 వేల మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరి మీరు కూడా ఎప్పుడైనా మాస్కులు లేకుండా బయట తిరిగారేమో గుర్తుచేసుకోండి. ఎందుకంటే మీపై కూడా కేసు నమోదు కావొచ్చు.