ఎస్ ఇప్పుడు ఇదే టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం కోసం చంద్రబాబు తమ పార్టీకి, తన సామాజిక వర్గానికే చెందిన ఓ నేత రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టేస్తోన్న పరిస్థితే కనిపిస్తోంది. ఇక పార్టీ మారి టీడీపీ చెంత చేరిన ఆనం తన నియోజకవర్గంపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆయన ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో రద్దయిన రాపూరు నుంచి కూడా విజయం సాధించారు.
అలాగే ఆయనకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనూ మంచి పట్టు ఉంది. 2004లో రాపూరు ఆ తర్వాత ఆత్మకూరు నుంచి గెలిచిన ఆయన 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే టీడీపీ ఆయనకు ఆత్మకూరు సీటు ఇస్తామని చెపుతోంది. నిన్న మొన్నటి వరకు వెంకటగిరి – ఆత్మకూరు రెండు నియోజకవర్గాల మధ్యలో ఊగిసలాడిన ఆనం ఇప్పుడు వెంకటగిరిలోనే పోటీ చేస్తానని పట్టు బడుతున్నారు.
ఆనం ఆత్మకూరు వెళితే చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండేదే కాదు. ఇప్పుడు వెంకటగిరి కావాలని పట్టుబడుతుండడంతో ఇక్కడ టీడీపీకి బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను ఏం చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. రామకృష్ణ కమ్మ సామాజిక వర్గ నేత. 2009లోనే ఆయన నేదరుమిల్లి రాజ్యలక్ష్మిని ఓడించారు. 2014లోనూ మరోసారి గెలిచారు. గత ఎన్నికల్లో ఆనం చేతిలో ఓడిపోయారు.
ఆనం ఆత్మకూరులో పోటీ చేస్తే వెంకటగిరిలో రామకృష్ణకు ఇబ్బంది ఉండదనుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆనం బెదిరిస్తుండడంతో చంద్రబాబు కూడా ఆనం కోసం రాజీపడి మీకు వెంకటగిరి టిక్కెట్ ఇస్తామని బుజ్జగింపులు చేసినట్టు సమాచారం. అదే జరిగితే కురుగొండ్ల రామకృష్ణ పొలిటికల్ కెరీర్కు చంద్రబాబు ఫుల్స్టాప్ పెట్టేసినట్టే అవుతుంది. ఇక వెంకటగిరి వైసీపీ తరపున ఇప్పటికే మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్కుమార్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేశారు.