(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టాలివుడ్ స్టార్ రామ్చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సింహం పిల్లలతో ఆడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రామ్చరణ్, ఉపాసనలు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తమ మారేజిడే జరుపుకుంటున్నారు. అక్కడ వారు గడుపుతున్న సరదా సమయం ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా రెండు సింహం పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన షేర్ చేస్తూ ఆసక్తికరమైన శీర్షిక పెట్టింది. ‘ఇప్పుడు తెలిసిందా మీకు మిస్టర్ సి నన్నెందుకు వివాహం చేసుకున్నారో’ అని వ్యాఖ్యానించింది. ‘ఈ ఆఫ్రికా పర్యటన మాకెన్నో పాఠాలు నేర్పింది. ప్రకృతిని, జంతువులను గౌరవించాలి. వాటిని కాపాడుకునేందుకు మనవంతు ఏదన్నా చేసే సమయం వచ్చింది. చేసే చిన్న పనులే పెద్ద మార్పును తెస్తాయి’ అని పేర్కొంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోకు వేలాది మంది అభిమానులు లైక్లు ఇస్తున్నారు.
ఆఫ్రికా పర్యటన నుండి వచ్చిన తరువాత చెర్రీ తిరిగి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొననున్నారు.