సౌత్అంప్టన్: లండన్లోని సౌత్అంప్టన్లో ప్రాక్టీస్లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి గాయం అయ్యింది.
అయిదవ తేదీ దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడాల్సిన తరుణంలో ప్రాక్టీస్కు వెళ్లిన కోహ్లీ కుడిచేతి బొటన వేలికి గాయం అయ్యింది. ఈ కారణంగా కోహ్లీ ప్రాక్టీస్ నుండి అర్ధాంతరంగా వెనుతిరిగి హోటల్ గదికే పరిమితం అయ్యారు.
ప్రస్తుతం అతని గాయానికి వైద్యులు పరిశీలిస్తున్నారనీ, దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో కోహ్లీ ఆడతారా లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జట్టు మేనేజ్మెంట్ వ్యాఖ్యానించింది.
మరో మూడు రోజుల్లో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం అవుతున్న వేళ టీమిండియా కెప్టెన్ కోహ్లీకి గాయం కావడం తోటి క్రీడాకారులనే కాక క్రికెట్ అభిమానులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది.