బర్మింగ్ హోంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా పోటీల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ రజీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జరీన్ తో స్వయంగా ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె విజయపరంపరను అభినందించారు. నిఖత్ జరీన్ విజయంతో తెలంగాణ కీర్తి మరో సారి విశ్వవ్యాపితం అయ్యిందని పేర్కొన్నారు కేసిఆర్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటుందని కేసిఆర్ మరో సారి వెల్లడించారు.
కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ జరీన్ 48-50 కేజీల (లైట్ ఫ్లై) విభాగం ఫైనల్ లో నార్తరన్ ఇగ్లాండ్ కు చెందిన బాక్సర్ కార్లే మెక్ న్యూయ్ పై అధ్బుత విజయం సాధించి బంగారు పతకాన్ని అందుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరగా, పతకాల పట్టికలో భారత్ నాల్గవ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లోనూ నిఖత్ జరీన్ అధ్బుతమైన ప్రదర్శన తో స్వర్ణం చేజిక్కించుకుంది. తాజాగా కామన్వెల్త్ క్రీడా పోటీల్లోనూ తన ప్రత్యర్ధి, నార్తన్ ఇర్లాండ్ కు చెందిన కార్లే మెక్ న్యూయ్ పై బౌట్లో ఆరంభం నుండే శివంగిలా విరుచుకుపడి తన పవర్ పంచ్ తో నిఖత్ జరీన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన నికత్ జరీన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ట్విట్టర్ వేదికగా నికత్ కు అభినందించారు మోడీ.
నిఖత్ జరీన్ 2011 లో టర్కీలో జరిగిన ప్రపంచ జూనియర్,యూత్ ఛాంపియన్ షిపిలో స్వర్ణం కైవశం చేసుకుంది. తరువాత 2014 లో నేషన్స్ కప్ లో స్వర్ణం, 2015 లో జాతీయ సీనియర్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం, 2016 లో దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడల్లో కాంస్యం,. 2018 లో సెర్పియాలోని బెల్ గ్రేడ్ లో జరిగిన టోర్నీలో స్వర్ణం, 2019 థాయ్ లాండ్ ఓపెన్లో రజతం, 2019, 2022 ల్లో స్టాంజా మెమోరియల్ లో స్వర్ణం, 2022 మే నెలలో ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించారు.