CM YS Jagan: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో సమతామూర్తి సహస్తాబ్ది సమారోహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో తొలుత తెలంగాణ సీఎం కేసిఆర్ పాల్గొన్నారు. శనివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొని సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీరామానుజాచార్యులు సహస్రాబ్తి వేడుకలకు హజరైయ్యారు. జీయ్యర్ స్వామి ఆశీస్సులు స్వీకరించారు.
CM YS Jagan: సాయంత్రం 4.30 గంటలకు శ్రీరామనగరం చేరుకోనున్న వైఎస్ జగన్
కాగా ఏపి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహనరెడ్డి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళుతున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం బయలుదేరనున్న సీఎం జగన్ సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ నుండి ముచ్చింతల్ శ్రీరామనగరం ఆశ్రమానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించి, విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్య క్షేత్రాలను సందర్శించి పూజల్లో పాల్గొననున్నారు. చిన జీయ్యర్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ఆహోబిలం జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఇష్టి మండపంలో దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం పరమేష్ఠి, పితృదేవతల విఘ్నాల నివారణ కోసం వైభవేష్టి హోమాలు నిర్వహించారు. ప్రవచన మండపంలో సుమారు 300 మంది భక్తులతో చిన్న జీయర్ స్వామి శ్రీరామ అష్టోత్తర నామ పూజ చేశారు. సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తులు పాల్గొంటున్నారు.
Read More: YS Jagan: దటీజ్ జగన్ అనిపించుకున్నారుగా..? టీ కప్పులో తుఫానులా ఉద్యోగుల ఆందోళన..!!