కరోనా కారణంగా కాలేజీలు మూతబడిన విషయం తెల్సిందే. ఇప్పుడు కళాశాలలను అక్టోబర్ 15 నుండి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్య విషయమై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు విషయాలపై స్పందించారు జగన్.
సెప్టెంబర్లో సెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు. అలాగే ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ను 80 శాతానికి తీసుకెళ్లాలని తెలియచేసారు. ఇక తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి కూడా ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. దాదాపు 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి జగన్ ఆమోదం తెలిపారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్రమాలకు పాల్పడుతున్న కళాశాలలపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సీఎం తెలియజేసారు.