భారత్ లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు పెరిగిపోవడం కలవరపెడుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5లక్షలు దాటిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత 24గంటల్లో భారత్ లో 18,552 కొత్త పాజిటివ్ కేసులు, 384 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 5,08,953కి చేరుకోవడం తీవ్రమైన విషయం.
ఇందులో ప్రస్తుతానికి 1,97,387 యాక్టివ్ కేసులు ఉండగా, 2,95,880 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన బుల్లెటిన్ లో వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ల్లో 3.5 లక్షల కరోనా కేసులు.. 12,600 మరణాలు సంభవించాయని తెలిపింది.