ఈ జులై నెలలో కరోనా విధ్వంసం మామూలుగా లేదు. ప్రపంచవ్యప్తంగా ఈ నెలలోనే ఎన్నడూ లేని విధంగా మారణకేళి జరిగింది అని చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జులైలో సగటున రోజుకు 2 లక్షల కేసులు పెరిగేవి. అత్యధికంగా గత 24 గంటల్లో 2,54,381 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క రోజులోనే 54,381 కేసులు పెరిగినట్టు. ఈ పెరుగుదల జులైలోనే అత్యధికం. ప్రపంచ వ్యాప్తంగా 1.46 కోట్ల కేసులు నమోదయ్యాయి.
ఇక పోతేఅమెరికా తరువాత ఇండియాలోనే అత్యధిక టెస్టులు చేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో ఇండియాలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,77,618 కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజుకు సగటున 5 వేల కేసులు పెరుగుతున్నాయి. జులై 18న 34,884 కేసులు నమోదైతే , జులై 19న 38,902 కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో టెస్టులు ఎక్కవ చేస్తుండటం వల్ల కరోనా పెరిగినట్లు తెలుస్తోంది. ఏపీ చూపించినంత దూకుడు టెస్టుల విషయంలో ఏ రాష్ట్రం చూపించకపోవడం గమనార్హం. తాజా గణంకాలను మనం ఒక సారి గమనిస్తే జులై 18,2020న 23,872 టెస్టులు చేస్తే 3,963 కేసులు నమోదయ్యాయి. అదే జులై 19,2020న 31,148 టెస్టులు చేయడం వల్ల 5,041 కేసులు నమోదయ్యాయి.
దేశంలోనే సగటున 10 లక్షల జనాభాకు ఏపీలోనే అత్యధిక టెస్టులు చేస్తున్నారు. 24,635 టెస్టులు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగినట్టే రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీన్ని కూడా పచ్చమీడియా తన రాజకీయాలకు వాడుకుంటూ ప్రజలను తప్పు పడుతోంది. ఐతే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే…. ఏపీలో టెస్టులు ఎక్కువ జరుగుతున్నాయని కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇది కూడా కేసులు పెరగడానికి ఒక కారణం.