కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిందని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా ఈ మహమ్మారికి చెక్ పెట్టే రీతిలో ట్రీట్మెంట్ గానీ వ్యాక్సిన్ గానీ అందుబాటులోకి రాలేదు. ఇంకా భూమి మీద కరోనా విలయ తాండవం చేస్తూ ఉండగానే.. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో వింత వ్యాధి తో జనాలు మూర్ఛ వచ్చి పడిపోవటం అదేవిధంగా వాంతులు విరోచనాలతో అనేక ఇబ్బందులు పడుతూ రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 500కు పైగా కేసులు రావడం ఒక దేశాన్ని మాత్రమే కాక ప్రపంచాన్ని షేక్ చేసింది ఏలూరు.
అయితే చాలా వరకు దీనికి కారణం నీటి కాలుష్యం అని అంటున్నారు గానీ సరైన స్పష్టత వింత వ్యాధి విషయంలో ఇంకా రాలేదు. ఇది ఇంకా మరిచిపోకముందే కేరళలో సరికొత్త వ్యాధి వచ్చినట్లు కేరళవాసులు ఆ వ్యాధి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే సౌత్ ఆఫ్రికా నుండి ఒక దోమ వల్ల ఈవ్యాధి వచ్చినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ క్లారిటీ ఇచ్చారు.
అయితే ఈ వ్యాధి పెద్దగా ప్రాణాంతకం కాకపోవచ్చని ఆమె చెప్పారు. ఈ పరాన్నజీవి కనుక మన శరీరంలో ప్రవేశిస్తే ముందు తల నొప్పి తర్వాత కండరాల నొప్పులు అలసట రావటం గ్యారెంటీ అని అదేవిధంగా మలేరియా కూడా వస్తుందని చెబుతున్నారు.