ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ని అంతమొందించడానికి చాలా దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసినట్లు ప్రకటనలు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇటువంటి తరుణంలో వ్యాక్సిన్ వేయించుకున్న గాని వెంటనే మాత్రం మాస్కులు తీసేసి బయట తిరగవద్దు అని వైద్య నిపుణులు తాజాగా హెచ్చరిస్తున్నారు. కొంతకాలం పాటు మా స్కూలు ధరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
వ్యాక్సిన్ వేయించుకున్న గాని కరోనా సోకే అవకాశముందని పేర్కొంటున్నారు. కొన్ని దేశాలలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు రెండు డోసులు వేయించుకునే విధంగా వైద్యులు రూపొందించారు. మొదటి డోసు వేయించుకున్న తరువాత అంతా బాగానే ఉంటే రెండో డోసు వేసే రీతిలో రూపొందించారు. ఈ విధంగానే బ్రిటన్ వ్యాక్సిన్ ఫైజర్ టీకా పనితనం ఉంది. మొదటి డోసుకు రెండు డోసుకు రెండు వారాలు గడువు ఉంది.
మొడెర్నా అయితే నాలుగు వారాల గడువు ఉంది. అంతేకాక టీకాల ప్రభావం తీసుకున్న వెంటనే కనిపించదని.. కొన్నివారాల సమయం పడుతుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణుడు డెబోరా ఫుల్లర్ పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే రియాక్షన్ బయట పడదు కొంత టైం పడుతుంది అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ వేయించుకున్న మాస్కు మాత్రం వెంటనే తియ్యకూడదు అని అంటున్నారు.