(కాకినాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కరోనా రాష్ట్రంలోని మంత్రులను భయపెడుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన రోజు సోమవారమే మరో మంత్రికి కూడా కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కల్గిస్తున్నది.
బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. మంత్రి వేణు గోపాల కృష్ణ నిన్న అంతర్వేది రథం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రికి కరోనా సోకినట్లు తెలియడంతో ఆ పార్టీ నేతలు, అధికారులు అందోళన చెందుతున్నారు. తనను కలిసిన వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వేణుగోపాల కృష్ణ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ రికవరీ శాతం ఎక్కువగా ఉండటం, మరణాల శాతం తక్కువగా ఉండటం కొంత ఊరటను ఇస్తున్నది. ఇప్పటికే పలువుుర పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.