తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు లేబరేటరీలలో మరియు ఆసుపత్రులలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఇచ్చిన తర్వాత ఆసుపత్రులు మరియు లేబరేటరీలకు ఆ పరీక్షలు నిర్వహించేందుకు తగిన గుర్తింపు కచ్చితంగా ఉండాలని కూడా ఆదేశించింది.
కావున ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన లేబరేటరీ లు మరియు కరోనా ట్రీట్మెంట్ ను సమర్థవంతంగా చేయగల డాక్టర్లు మరియు ఆస్పత్రి సిబ్బంది ఉన్న కొన్ని ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని జారీ చేయగా వాటి లిస్తుని ఒక సారి చూద్దాం.
జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, విమ్టా ల్యాబ్స్లో చెర్లపల్లి, అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, బోవెన్పల్లిలో డయాగ్నొస్టిక్ లాబొరేటరీ, పంజాగుట్ట లోని రెమెడీస్ ల్యాబ్స్, మెడ్చల్ లోని పాత్కేర్ ల్యాబ్స్లో, సెరిలింగంపల్లి లో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, కొత్త బోవెన్పల్లి లో మెడ్సిస్ పాత్లాబ్స్, సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం, మేడ్చల్, మల్కాజ్గిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్, బంజారా హిల్స్లో టెనెట్ డయాగ్నోస్టిక్స్; మరియు బంజారా హిల్స్లోని స్టార్ హాస్పిటల్లో ల్యాబ్ మెడిసిన్ విభాగం.