బంధుత్వాలు కూడా రాజకీయాల ముందు బద్దలవుతాయి.ఎవరికి వారే రాజకీయ వైకుంఠపాళిలో పైకెళ్లి పోవటానికి ప్రయత్నించే క్రమంలో అన్నా తమ్ముడు అక్కా చెల్లి ఎవరినైనా తొక్కేస్తారు.ప్రస్తుతం నంద్యాల టిడిపి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిది ఇదే పరిస్థితి.2017 ఉప ఎన్నికల్లో తనను గెలిపించిన సోదరి భూమా అఖిల ప్రియ ఇప్పుడు తనను తొక్కే స్తుండటంతో తట్టుకోలేని పరిస్థితుల్లో బ్రహ్మానంద రెడ్డి వైసీపీలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల సమాచారం.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచి నాడు చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై టీడీపీలో చేరి ఏకంగా మంత్రి అయ్యారు. ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చిన నంద్యాలలో తన కజిన్ బ్రదర్ భూమా బ్రహ్మానందరెడ్డిని అఖిలప్రియ నిలబెట్టి గెలిపించారు.అయితే ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి అఖిలప్రియ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయని,అఖిలప్రియను వీడి ఆయన తన దారి తాను చూసుకుంటున్నాడని రాజకీయ వర్గాల భోగట్టా.
2024 ఎన్నికల్లో తన సొంత సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిని నంద్యాల నుండి రంగంలోకి దింపాలని అఖిలప్రియ ఎత్తుగడ వేసి ఈ క్రమంలోనే భూమా బ్రహ్మానందరెడ్డిని అడ్డు లేకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.దీన్ని పసిగట్టిన బ్రహ్మానందరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం టిడిపిని వీడి టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారంటున్నారు .ఇప్పటికే వైసీపీలో చేరికపై భూమా బ్రహ్మానందరెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి వైసీపీ నేతలతో ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం.భూమా అఖిలప్రియ వ్యవహార శైలి కారణంగా ఇప్పటికే భూమా నాగిరెడ్డికి ఆత్మ వంటి ఏవీ సుబ్బారెడ్డి కూడా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏకంగా సోదరుడికి అఖిలప్రియ ఎసరు పెట్టిందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి