Varalakshmi : కోలీవుడ్ లో హీరోయిన్ గా విలక్షణ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె హీరోయిన్ అవకాశాల కోసం ఎప్పుడు ఎదురు చూడలేదు. హీరోయిన్ గా అయితేనే చేస్తానని పట్టుపట్టలేదు. కొత్తగా వచ్చిన ప్రతీ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని చేసింది. ఒకరకంగా చెప్పాలంటే కోలీవుడ్ లో విలక్షణ నటుడు అని విజయ్ సేతుపతికి ఎలా క్రేజ్ ఉందో వరలక్ష్మీకి అలాంటి క్రేజ్ ఉంది. ఇలాంటి వాళ్ళకోసం అన్ని ఇండస్ట్రీలు ఎదురు చూస్తుంటాయి.
వెర్సటైల్ యాక్ట్రెస్ అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే ఈమెకి బాగా ప్లస్ అయింది. తనకోసమే కొత్త తరహా పాత్రలు తయారవుతున్నాయంటే ఆమెలో ఉన్న నటికి ఎంతటి పాపులారిటీ ఉందో అర్థమవుతోంది. అందుకే ఈమెని మన మేకర్స్ టాలీవుడ్ కి తీసుకు వచ్చారు. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. టాలీవుడ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యూనిక్ యాక్ట్రెస్ జయమ్మగా పరిచయం అయింది. ఈ సినిమాతో పాటు అల్లరి నరేష్ నటించిన నాంది లో కూడా నటించి మంచి క్రేజీ నటిగా మారింది.
Varalakshmi : టాలీవుడ్ లో వరలక్ష్మీ సెటిలయినట్టే అంటున్నారు.
దాంతో ఇప్పుడు ఈమెకి టాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు దక్కుతున్నట్టు చెపుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్య సినిమాలో కీలక పాత్రకి ఎంపిక అయిందట. క్రాక్ తెరకెక్కించిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకుడు. అందుకే అవకాశం ఇచ్చాడట. త్వరలో దీనికి సంబంధించిన అధికారక ప్రకటన రానుందని తెలుస్తోంది. అలాగే ఇటీవల జాంబిరెడ్డి తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హను..మాన్’లో కూడా ఓ స్పెషల్ రోల్ కి వరలక్ష్మీని తీసుకుంటున్నారని న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. మొత్తానికి టాలీవుడ్ లో వరలక్ష్మీ సెటిలయినట్టే అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!