Marriage: వినాయక వ్రత ప్రయోగం
శీఘ్ర వివాహానికి వినాయక వ్రత ప్రయోగం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన వివాహం జరగకపోతే శక్తివంతమైన ఈ వ్రతాన్ని చేసుకుంటూ గణపతిని పూజించుకోవాలి. ఒక శుభ తిధి వున్న బుధవారం చూసుకుని ఈ పరిహారాన్నిప్రారంభించి వరుసగా 21 రోజుల పాటుచేయవలిసి ఉంటుంది.
ఈ పరిహారం కోసం ప్రతి రోజూ సరిగ్గా లెక్క పెట్టి 21 గరిక పోచలను తీసుకుని ఒక కట్టగా కట్టుకుని ఒక ఎర్రని పువ్వు, ఒక దాల్చిన చెక్క ముక్కను గరిక పోచల కట్ట పైఉంచి మీకు దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లి, త్వరగా విహహం జరగాలని సంకల్పం మనస్సులో చెప్పుకొని, అక్కడే ఆయనకు సమర్పించి, వినాయకుని పూజ చేయిన్చుకుని రావాలి. ఇలా చేయడం వలన, వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న ఆటంకాలు తొలగి,వివాహ ప్రయత్నాలు చాలా త్వరగా విజయవంతం అవుతాయి. స్త్రీలు పీరియడ్ రోజులలో ఆపేసి, మరల కొనసాగించి 21 రోజులను పూర్తి చేసుకోవచ్చు. ప్రేమ వివాహానికి పెద్దల నుండి ఎదురవుతున్న వ్యతిరేకతను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు.
ఈశాన్యం మూల
పిల్లలు పుట్టక పోవడం, పిల్లల కు ఎప్పుడు ఎదో ఒక ఆరోగ్య సమస్యలు రావడం, చదువు అబ్బక పోవడం, ఎంత కష్టపడి చదివినా గుర్తుండకపోవడం, జాతకం లో గ్రహ దోషాలు, జాతకంలో శని ఉండటం, పెళ్లి అవ్వకపోవడం, పెళ్లి జరిగినా ఎప్పుడు గొడవలు పడుతుండడం ,శత్రు పీడా ఇలాంటి వాటి ని పోగొట్టుకోవడానికి ఒక పరిష్కారం ఉంది. అరటి చెట్టు, తులసి చెట్టు ఈ రెండిటిని ఒక మంచిరోజు చూసి, ఇంట్లో ఈశాన్యం మూల నాటాలి. రోజు కొంచెం ఎండ తగిలేలా పెట్టి, నీళ్ళు పోస్తుండాలి. రోజు వీటికి పూజ చేసి దీపం పెడుతుండాలి. ఈ విధం గా ప్రతి రోజు భక్తి శ్రద్దలతో చేయడం వలన పైన చెప్పబడిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.