Dhruva 2: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో చిరుత, మగధీర, రంగస్థలం వంటి ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి. వాటిలో ధృవ సినిమా ముందంజలో ఉంటుంది. ఒకప్పుడు చెర్రీ తుఫాన్, ఎవడు, బ్రూస్ లీ వంటి రొటీన్ సినిమాలతో అభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాడు. ఈ ఒకే రకమైన మాస్ సినిమాలు చూడలేక ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాతో తనని తను కొత్తగా పరిచయం చేసుకున్నాడు.
Dhruva 2: ఆ సినిమా విశేషాలు
తమిళంలో సూపర్ హిట్టైన తనీ ఒరువన్ సినిమాని రీమేక్ చేసి ధృవ సినిమాని తెలుగులో తెరకెక్కించాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, ఫిజిక్, నటన, స్క్రీన్ ప్రెజన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీని ఒరిజినల్ అయిన ‘తని ఓరువన్’ సినిమాని మోహన్ రాజా డైరెక్టర్ చేసారు. నిజానికి మోహన్ రాజా ఎక్కువగా రీమేక్ సినిమాలు తీసి హిట్స్ అందుకుంటాడు. కానీ ఒక్కసారి మాత్రం అతను తన క్రియేటివిటీని వాడి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ డైరెక్టర్ ఇటీవల గాడ్ ఫాదర్ రీమేక్ చేసి మళ్లీ హిట్ అందుకున్నాడు.
లేట్ అయినా మూవీ రావడం మాత్రం పక్కా
ఇప్పుడు ఈ రీమేక్ రాజా ధృవ సినిమాకి సీక్వెల్ని తీసుకొచ్చే పనిలో పడ్డారని తెలుస్తోంది. మోహన్ రాజా ఈ ధృవ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడారు. తమిళంలో కూడా తనీ ఒరువన్-2 కోసం కథ పూర్తి అయిందని.. ఈ కథని అతని తమ్ముడు జయం రవికి వినిపిస్తే, అతను ఓకే చెప్పడానికి, చరణ్ కీ కూడా కథ చెప్పారని, అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఈ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దాంతో ఈ మూవీ రావడం పక్కా అని స్పష్టమయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!