Tablets: కాలం మారుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆహారపు అలవాట్లు మారాయి. వాతావరణ కాలుష్యం పెరిగింది. వాటితో పాటు రోగాలు కూడా దండిగా పెరిగాయి.. వెరసి మనలో చాలా మంది ప్రతి రోజూ హాస్పిటల్ కో, ఓ మెడికల్ షాపుకో వెళ్ళవలసిన పరిస్థితి దాపురించింది. ఇక మందులు వాడకం అనేది మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. మనలో అనేకమంది అవసరానికి తగ్గట్టు మందులు మింగుతారు. కానీ ఆ మందులు వెనక వున్న రెడ్ లైన్ ను మాత్రం ఎవరూ పట్టించుకోరు. అంతవరకూ సరే.. కొంతమంది మహానుభావులైతే చాలా గుడ్డిగా మెడిసన్ తీసుకుంటారు. అది మనకు తెలిసిందే.
Karthika deepam Dec 21: దీప-కార్తీక్ పిల్లలు దొరుకుతారా?
ఆ ఎరుపు గీతలు ఏమిటి?
ఇటీవల ఈ రెడ్ లైన్కి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. దీని సారాంశం ఏమంటే, యాంటీబయోటిక్స్ షీట్ల వెనక రెడ్ స్ట్రిప్ ఎందుకు ఉంటుందో చెప్పారు. విషయం ఏమంటే ఇలాంటి లైన్ ఉన్న మందుల్ని మనం డైరెక్టుగా కొనకూడదట. కేవలం డాక్టర్ల డిస్క్రిప్షన్ తోనే వీటిని వాడాలి. లేకుండా సైట్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని హెచ్చరించింది. మందుల షాపుల వాళ్లు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మందుల్ని సజెస్ట్ చేయకూడదు. కానీ వారు మనకి ఈ విషయాలు ఏమీ చెప్పరు.
CM YS Jagan: ఒటీఎస్ లబ్దిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!!
మెడికల్ షాపు వారు ఈ విషయం మనకు ఎందుకు చెప్పరు?
చాలా సింపుల్. వాడికి వ్యాపార లాభాలు తప్ప, మనుషుల ఆరోగ్యాలతో పనేముంది? చాలా మెడికల్ షాపులలో స్టాఫ్.. టెన్త్ పాసైన వారు, లేదంటే అంతకంటే తక్కువ చదువుకున్న వారే మనకు కనిపిస్తారు. కనీసం వారికి మెడికల్ టర్మ్స్ గురించి కూడా అవగాహన ఉండదనే విషయం చాలామందికి తెలియదు. ఇక ఇలాంటి లోపాలను ప్రభుత్వాలు పట్టించుకోనంతవరకూ ఫార్మసీలలో అక్రమాలకు అడ్డుకట్ట పడదనే మనం అనుకోవాలి.