మహమ్మారి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 16వ తారీకు నాడు ప్రధాని మోడీ చేతుల మీదుగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇవ్వాలి అన్న దాని విషయంలో కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
వచ్చిన ఆదేశాల ప్రకారం దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వ్యాక్సిన్ ఓపెన్ చేసిన నాలుగు గంటల లోపే ఉపయోగించాలని లేకపోతే టీకా నిర్వీర్యం అవుతుందని, వాటిని వాడకూడదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రతి 5ఎంఎల్ వ్యాక్సిన్ సీసా 10 డోసులను కలిగి ఉంటుంది.
ఒక్కసారి ఓపెన్ చేస్తే అనంతరం అందులో ఉండే పది డోసులను నాలుగు గంటల్లోగా ఉపయోగించాలి. లేకపోతే వ్యాక్సిన్ ప్రభావం పెద్దగా ఉండదని ఢిల్లీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అధికార ప్రతినిధి ఛవీ గుప్తా తెలిపారు. ఈ క్రమంలో తమ వద్ద మొదటి రోజు 45 మందికి టీకా ఇవ్వటం జరిగింది అని నాలుగు సీసాలు పూర్తయ్యాయని తెలిపారు.