బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం అనేది చాలా ముఖ్యమైనది. కానీ ప్రసవం తరువాత ఆడవారు వ్యాయామం చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు. దాదాపుగా మహిళలు అందరూ పిల్లలు పుట్టిన తర్వాత బరువు పెరుగుతారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకున్న ఆహారం కారణంగా బరువు విపరీతంగా పెరుగుతారు మరియు ప్రసవం తరువాత ఎటువంటి ఒత్తిడి పడకూడదని డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెబుతారు. ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల కనీసం ఒక నెల పాటు వ్యాయామం చెయ్యడానికి అవకాశం ఉండదు. కాబట్టి డెలివరీ తరువాత మహిళలు బరువు పెరుగుతారు.
ఈ ప్రెగ్నన్సీ సమయం లో పెరిగిన బరువు డెలీవరి తర్వాత కూడా అలానే ఉండి పోతుంది. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మీరు మళ్లీ తిరిగి మీ బరువును మునుపటిలా అదుపులో ఉంచుకోవచ్చు.
* ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. కానీ ఎక్కువసార్లు తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవచ్చు.
* పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
* పాలు, పెరుగు, గుడ్లు, పప్పుధాన్యాలు, మాంసాహారం లాంటివి తగ్గించడం ఉత్తమం.
* ఒకేసారి బరువు తగ్గాలని ఆహారం మానేయకూడదు..మీరు పిల్లలకు పాలు ఇచ్చే లా అయితే ఏది మీకు చాలా ఇబ్బంది అవుతుంది.
* మీరు పిల్లలకు పాలు ఇస్తుంటే కూడా మీ బరువు క్రమంగా అదుపులోకి వస్తుంది.
* పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు లో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని రరోజూ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
* వీటిన్నింటితో పాటు రోజుకి అరగంట వ్యాయామం చేయడం లేదా నడిచినా మంచి ఫలితాలు ఉంటాయి.