Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దుకుడు పెంచింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా ఈడీ సమన్లు పంపుతోంది. అయితే ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హజరు అవుతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ కు చెందిన పలు ప్రదేశాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. జల్ బోర్డు మాజీ సభ్యుడు శలబ్ కుమార్ తో పాటు ఆప్ తో సంబంధం ఉన్న పలువురికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈడీ సోదాలపై ఆప్ మహిళా మంత్రి స్పందించింది. ఢిల్లీ మంత్రి అతిశీ స్పందిస్తూ తమ పార్టీని అణచివేసేందుకే ఈడీ దాడులు చేపట్టిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో తమ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ వాంగ్మూలాలను సేకరిస్తొందని మండిపడ్డారు. ఈ కేసు పేరుతో రెండేళ్లుగా ఆప్ నేతలను బెదిరిస్తున్నారన్నారు.
కొందరి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారని, మరి కొందరికి సమన్లు జారీ చేస్తున్నారనీ, ఇంకొందరిని అరెస్టు చేశారన్నారు. ఇన్ని చేసినా ఒక్క రూపాయి కూడా ఆ సంస్థ స్వాధీనం చేసుకోలేదని, తగిన అధారాలను గుర్తించలేదన్నారు. సాక్ష్యాలను సమర్పించాలని కోర్టు పదేపదే అడుగుతోందని ఆమె తెలిపారు. సాక్ష్యులు ఇచ్చిన ఆడియో రికార్డింగ్ లను దర్యాప్తు సంస్థ డిలీట్ చేసిందని ఆమె విమర్శించారు.
BRS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. సీనియర్ నేత తాటికొండ రాజయ్య రాజీనామా