ఫేస్బుక్ యూజర్లకు సరికొత్త ఫ్యూచర్ ఆ సంస్థ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సరికొత్త ఫీచర్ వల్ల ఫేస్బుక్ యూజర్లకు తమ పేజీపై వచ్చే పొలిటికల్ యాడ్స్ ఈజీగా బ్లాక్ చేసుకునే అవకాశాన్ని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల గత కొన్ని సంవత్సరాల క్రితం వివాదాస్పదమైన రాజకీయ ప్రకటనలు ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ లలో ఎక్కువ రావటంతో జుకర్ బర్గ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే త్వరలో నవంబర్ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి అటువంటి పొరపాటు జరగకూడదని, తనపై తన సంస్థ పై విమర్శలు రాకూడదనే ఉద్దేశ్యంతో ‘ఓటింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ అనే ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా యూజర్లకు అవసరమైన సమాచారం లభిస్తుందని, ఓటు హక్కు కోసం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి.? ఓటింగ్ కేంద్రం వివరాలు, ఇతరత్రా విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చని జుకర్బెర్గ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుమారు 160 మిలియన్ ప్రజలు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ఫీడ్స్లో చూస్తారని భావిస్తున్న ఆయన.. ఈ సంఖ్యను మరింతగా పెంచి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఓటింగ్ జరగాలనే ఉద్దేశంతో జుకర్బెర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ పోటీ చేసే అభ్యర్థుల పొలిటికల్ యాడ్స్ విషయంలో కఠిన చర్యలు కట్టడి చేయడం కోసం జుకర్బెర్గ్ సరికొత్త ఫీచర్ తీసుకురావడంతో పేస్ బుక్ యూజర్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.