Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. పరిశ్రమలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనలకు గురైయ్యారు.
ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తొంది. వారిలో కొందరు కార్మికులు కిటికీల్లోంచి బయటకు దూకి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో చిక్కికున్న వారిని అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు రక్షించారు.
నిచ్చెనల సాయంతో కార్మికులను బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని భావించి అధికారులు మరినన్ అగ్నిమాపక శకటాలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట