Shanti Swaroop: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండె పోటుతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు శాంతి స్వరూప్.
తెలుగులో తొలి సారి వార్తలు చదివిన ఆయన ..తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పదేళ్ల పాటు టెలీ ఫ్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు. 1983 నవంబర్ 14 నుండి దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. తెలుగు ప్రజానీకానికి పరిచయం చేయనవసరం లేని పేరు ఆయనది.
2011 లో పదవీ విరమణ చేసే వరకూ దూరదర్శన్ లో ఆయన పని చేశారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ ఆవార్డు అందుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
YS Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం ..ఈ రోజు షెడ్యూల్ ఏమిటంటే..?