Healthy Drinks: రోజు వారీ ఆహారం భాగం గా మనం పాలు ,మజ్జిగ ,పళ్ళ రసాలు తీసుకుంటూ ఉంటాము.. అయితే వీటికి ఒక టైం ఉంటుందని చాలామందికి తెలియదు. ఎప్పుడు ఏది కావాలనిపిస్తే అది తాగేస్తుంటారు. అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని నిపుణులు తెలియచేస్తున్నారు. ఏ సమయం లో ఏది తాగాలో అది మాత్రమే తీసుకోవడం వలన మరింత ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలియచేస్తున్నారు . నిపుణులు లెక్క ప్రకారం ఎప్పుడు వీటిని తీసుకోవాలో వాటి వివరాలు తెలుసుకుందాం.
Healthy Drinks పాలు,పెరుగు, మజ్జిగ,పళ్లరసాలు వీటిని ఏ సమయంలో తీసుకోవడం వలన ఏమి జరుగుతుందో తెలుసుకోండి !! (పార్ట్-2)
పండ్ల రసాల విషయానికి వస్తే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత తీసుకోవడం ఉత్తమం అని చెప్పబడింది . ఈ పండ్ల రసాలు కూడా ఏ ఏ ఋతువులు దొరికే పండ్ల రసాలు ఆ ఋతువులలో నే తీసుకోవాలి . అలా ఆ ఋతువుల్లో దొరకని పండ్ల రసాలు అసలు త్రాగకూడదు. ఇలా తాగడం వలన ఆరోగ్యానికి హాని కలుగక మానదు . దానికి కారణం ఏమిటంటే మన శరీరానికి ఏ ఏ ఋతువుల్లో ఏమేమి ఏమి అవసరమవుతాయో వాటిని ప్రకృతి కొన్ని రకాల పండ్ల రూపం లో మనకు అందిస్తుంది. అంతేగాని పండ్లు ఆరోగ్యానికి మంచివని ఆ ఋతువుల్లో కాయని పండ్లు తినకూడదు. అలా తినడంచాల ప్రమాదం . ఇప్పుడున్న పరిస్థితుల్లో పండ్ల డిమాండ్ బాగుందని కొన్ని కంపెనీలు రసాయనాలతో పండ్లు, పండ్ల రసాలను శుద్ధిచేసి కోల్డ్ స్టోరేజ్ లో ఉంచి సంవత్సరం అంతా అందిస్తున్నారు. అందుబాటులో ఉన్నాయి కదా అని వాటిని తినడం మనకే ప్రమాదం. కావున ఉదయం భోజనం ,లేదా టిఫిన్ తర్వాత ఆ ఆ కాలంలో దొరికే తాజా పండ్ల రసాలను తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది
అలాగే మజ్జిగని మధ్యాహ్నం భోజనం సమయంలో తాగాలి . అది కూడా వెన్న తీసిన మజ్జిగ అయివుండాలి. లస్సి త్రాగకూడదు, ఎందుకంటే అందులో వెన్న ఉంటుంది కాబట్టి తాగకుండా ఉండటం మంచిది. మీరు ఎప్పుడు మధ్యాహ్న భోజనం తరువాత త్రాగవలసినది కేవలం వెన్న తీసిన మజ్జిగ మాత్రమే తాగడం చాలా ఆరోగ్యకరం.
పాలను రాత్రి భోజనం తర్వాత తాగడం చాలా మంచిది.పాలు మాకు జీర్ణం అవుతున్నాయి అని అనుకునే వాళ్ళు మీరు పాలను రాత్రి సమయంలో తీసుకోండి, పగలు పాలు తీసుకోకుండా ఉండడం మంచిది.
దీన్ని అటు ఇటు, ఇటు అటుగా మార్చకండి. పాలను ఉదయం లేక మధ్యాహ్నం తాగడం శ్రేయస్కరం కాదు అని చెప్పక తప్పదు. ఎందుకంటే వాటిని జీర్ణం చేయు ఎంజైములు ఆ సమయంలోనే ఉంటాయి.