ప్రతి సమస్యకు ఖచ్చితంగా సమాధానం ఉంటుంది..! అయితే ప్రతి సమస్యకు ఒకే సమాధానం ఉండదు..! చాలా పద్ధతుల్లో ఆ సమస్యకు సమాధానం రాబట్టవచ్చు.. సులభమైన పద్ధతిలో సమాధానాలు రాబట్టడం ఒక కళ. ఏ ప్రశ్నకైనా జవాబును తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, నాణ్యమైన పరిష్కారం గుర్తించడం ఒక నేర్పు.. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా..? ఏదైనా సమస్యను అర్థం చేసుకొని, దానిని చిన్న చిన్న సమస్యలు గా విభజించి, వాటి సమాధానాలతో అసలు సమస్యను సాధించే నైపుణ్యం గల ఇంజనీరింగ్ కి ఇది మూలస్తంభం..!
ప్రతి సంవత్సరం ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ను మానవ వనరుల సంస్థ టాగ్ డ్ , భారత పరిశ్రమల సమాఖ్య (సీ ఐ ఐ), ఆన్లైన్లో ప్రతిభ పరీక్షలు నిర్వహించే సంస్థలు 2020 రిపోర్ట్ ను ప్రకటించాయి..! విద్యా – శిక్షణ సంస్థల బోధనా పద్ధతులు, నైపుణ్యాల శిక్షణ పద్ధతులు, పరిశ్రమల నిపుణుల అభిప్రాయాలను కలిపి నివేదిస్తుంది..!ఉద్యోగాలకు కావలసిన కొత్త మొలకువలపై సిఫార్సులు, సాంకేతిక విద్యార్థులపై ఉద్యోగ సంసిద్ధత వివరాలు ఇలా ఉన్నాయి..
1. పారిశ్రామిక విప్లవం 4.0 అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థులు నైపుణ్యాలను నేర్చుకోవాలి.
2. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగు పరచుకోవడం చాలా అవసరం. లర్న్- ఆన్- లర్న్- రీ లర్న్ ను అలవాటు చేసుకోవాలి.
3. బీటెక్ పూర్తిచేసుకుని కళాశాల నుండి బయటకు వచ్చే వారిలో ఉద్యోగ సంస్కృత కేవలం 15 శాతం ఉంది.
4. ఇంజనీరింగ్ అభ్యర్థుల మెలకువలో 2019 సంవత్సరం కంటే ఈ ఏడాది తొమ్మిది శాతం తరుగుదల ఉంది.
5. ఎంబీఏ అభ్యర్థుల ఉద్యోగ సంస్కృత అధికంగా ఉంది అంటే మీరు పాఠ్యాంశాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి.
6. బ్యాంకింగ్, బీమా, ఐటీ, ఫైనాన్షియల్, ఇంటర్నెట్ వ్యాపార రంగాలలో ఉద్యోగ నియామకాలలో గడిచిన ఐదేళ్లుగా పెను మార్పులు జరిగాయి. ఈ రంగాల్లో భారీగా అవకాశాలు పెరిగాయి.
7. జాబ్ పో, లింక్డ్ఇన్ వంటి సోషల్ మాధ్యమాలలో ఉద్యోగుల రిఫరల్ మార్గాల ద్వారా అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.